దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోంది – వెెంకయ్య నాయుడు

-

దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెెంకయ్య నాయుడు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఏబీవీపీ అమృతోత్సవ వేడుకలు జరిగాయి. ఏబీవీపీలో పని చేసిన ప్రస్తుత, పూర్వ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వెెంకయ్య నాయుడు మాట్లాడుతూ…దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోంది… గౌహతిలో తొలి జాతీయ మహ సభకు హజరయ్యానన్నారు. ఏబీవీపీలో పని చేసే సమయంలో పిరాట్ల సంఘటనా ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు… నాకు నాయకత్వంలో తర్ఫీదు ఇచ్చింది ఏబీవీపీనే అని చెప్పారు.

శక్తి వంతమైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.. నేను రాజకీయాలలో నుంచి వైదొలిగాను అని వెల్లడించారు. ఏబీవీపీ వల్లనే నేను అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగాను… రాజకీయాలను అధ్యయనం చేయాలని కోరారు. మంచి ఆలోచనలు స్వాగతించాలి… కులము కుర్చీ ఇవ్వదన్నారు. వ్యక్తి నిర్మాణం విద్యతో వస్తుంది…వేదాల్లో సారం తెలుసు కోవాలని కోరారు. రేపటి భారత దేశం పటిష్టంగా ఉండాలని కోరారు మాజీ ఉపరాష్ట్రపతి వెెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news