కొత్తగా బాబా అవతారం ఎత్తిన చంద్రబాబు – వైసీపీ ఎంపీ

-

చంద్రబాబు రాఖీ వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి’ అనేది వ్యాపార ప్రకటన అని.. కొత్తగా బాబా అవతారం ఎత్తిన చంద్రబాబు గారు కూడా ప్రజలు తమ బాధలు తనకు చెప్పుకుంటే దేవుడికి విన్నవించుకున్నట్టే అని ‘సంకల్పాల’ గురించి మాట్లాడుతున్నాడని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ప్రజల మీద కోపంతో రాఖీలకు తాంత్రిక పూజలు చేసి పంపిస్తారా ఏంటి…బాబు గారూ ? అంటూ ఫైర్‌ అయ్యారు. ఇక అటు కాలి నడక భక్తులకు భద్రత కల్పిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటన చేశారు. భక్తులపై వన్యమృగాల దాడులను నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిసి టీవీల ఏర్పాటుతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు. శ్రీవారి ఆతృకుల భద్రతకు టీటీడీ పాలకమండలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని వెల్లడించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news