ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తున్నారు – పురంధేశ్వరి పై సాయిరెడ్డి సీరియస్

-

ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తున్నారు అని పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి సీరియస్ అయ్యారు. చిన్నమ్మా పురందేశ్వరి! ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఏంటమ్మా? భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఆయన ఆత్మను క్షోభకు గురిచేసారే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం కొనుగోలు ధర రూ.4,160. నాణెం తయారీకి 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ వంటి విలువైన లోహాల సమ్మేళనం అన్నారు.

సంస్మరణార్ధం గౌరవ సూచికంగా విడుదల చేసే ఇటువంటి నాణాలు చెలామణి కోసం కాదు. సేకరణ కోసం. అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ ని చెల్లని కాయిన్ చేసినట్టేగా బాబుగారని తెలిపారు. ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం పూజకు పనికిరాని పువ్వులా మిగిలిపోనుంది. మిగతా కాయిన్స్, కరెన్సీలాగా మార్కెట్ చలామణిలో ఉండదు. దాని విలువను కూడా కేంద్ర ఆర్థిక శాఖ రూ.4,160గా నిర్ణయించిందని తెలిపారు. చంద్రబాబు గారి బృందం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మింట్ లో అచ్చు వేసే 12 వేల నాణాలను హెరిటేజ్ తో కొనిపిస్తారా బాబుగారు? అని చురకలు అంటించారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version