పప్పు నాయుడు కూడా రాహుల్ గాంధీలా 4 కిమీ పరుగెత్తాలి – విజయసాయిరెడ్డి

-

పప్పు నాయుడు కూడా రాహుల్ గాంధీలా 4 కిమీ పరుగెత్తాలంటూ సెటైర్లు పేల్చారు వైసీపీ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి. నిన్న రాహుల్‌ గాంధీ పరుగెత్తిన అంశాన్ని లెవనెత్తిన విజయసాయిరెడ్డి.. నారా లోకేష్‌ ను ఉద్దేశించి.. సెటైర్లు వేశారు.

పప్పు నాయుడు కూడా ఓ నాలుగు కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి మోకాళ్ల జాయింట్లు, మెదడులో చిప్ పర్ ఫెక్టుగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఆయన బాడీ బ్యాలెన్స్ మీద కార్యకర్తలకున్న అనుమానాలు పటాపంచలు చేయాలంటే రన్నింగ్ తప్పదని చురకలు అంటించారు.

ఇక మరో ట్వీట్‌ లో.. తెలుగు దేశం పార్టీపై సెటైర్లు వేశారు సాయిరెడ్డి. 3.60 లక్షల కోట్లు పెట్టి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘twitter’ను కొనుగోలు చేశాడు Elon Musk. ప్రక్షాళనలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగిస్తే అయ్యో మాకున్న ‘స్లీపర్ సెల్’ లేకుండా పోయిందే, ఇప్పుడెలా అని తెలుగు దొంగల పార్టీ వాళ్ళు శోకాలు పెట్టడమేమిటో? అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news