ఏపీని ముక్కలు చేసి సర్వనాశనం చేశావమ్మా – విజయసాయి మరో ట్వీట్

-

ఏపీని ముక్కలు చేసి సర్వనాశనం చేశావమ్మా అంటూ బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. మీపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం అంటే పురంధరేశ్వరి గారూ…2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపిగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్ల తో బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిస్తే…కేంద్ర మంత్రి అయ్యి తమరు చేసింది ఏంటో తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా! అంటూ ఆగ్రహించారు.

vijayasai reddy and purandeswari

మళ్లీ 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు కేవలం 2.73% అంటే 33,892 ఓట్లు. మొత్తం 12 లక్షల 50 వేల ఓట్లలో 33 వేల ఓట్లంటే కనీసం మన సామాజికవర్గం వాళ్ళు కూడా వేయనట్టే కదా! మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా. ఒకసారి మీకు గుర్తు చేయమని ఒక విశాఖ మిత్రుడు పంపాడని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news