కన్నతండ్రికి ద్రోహం చేసిన చరిత్రహీనుడు – బాలయ్యపై విజయసాయి ఫైర్

-

కన్నతండ్రికి ద్రోహం చేసిన చరిత్రహీనుడు అని నందమూరి బాలయ్యపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాదు.. చంద్రబాబు, బాలయ్య దిగిన ఫోటోను షేర్‌ చేసి మరీ.. బాలయ్యపై నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి. అంతా అధికారమే పరమావధి! క్రూర రాజకీయాలే…కుటుంబ, మానవ విలువలు ఎక్కడ? ఒకరు పిల్లనిచ్చిన మామకు ద్రోహమన్నారు.

1296లో జలాలుద్దీన్ ఖిల్జీని విందుకు పిలిచి అల్లుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ హత్య చేసి తనను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నాడు. నారాది అదే ఆటవిక న్యాయం అంటూ బావ, బామ్మర్దులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి. మరొకరు కన్నతండ్రికి ద్రోహం చేసిన చరిత్రహీనుడు.1657లో ఔరంగేబు తన తండ్రి, మొఘల్ చక్రవర్తి షాజహానును నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి కూలదోసి, చనిపోయే వరకు జైల్లో బంధించాడు. ఇప్పుడు ఎవరిని ఎవరితో పోల్చవచ్చో మీరే నిర్ణేతలు అని సెటైర్లు పేల్చారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news