BREAKING : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్​లు దగ్ధం

-

ఏపీలోని విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున నగరంలోని కేపీనగర్‌ ప్రాంతంలో ఉన్న టీవీఎస్‌ వాహనాల షోరూంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న సుమారు 300 వరకు బైక్​లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.15 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్‌ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు గోదాముల్లో ఉంచుతారు. బైక్​ షోరూంతో పాటు సర్వీస్‌ సెంటర్‌‌లను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున షోరూమ్‌లోని మొదటి అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు అటు గోదాముకూ విస్తరించాయి. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించాయి.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా పార్క్‌ చేసి ఉంచడం.. వాటిని ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news