నేడే హైదరాబాద్​లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా

-

పేదవాళ్లు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు రెండు పడక గదుల ఇళ్లను పొందారు. ఇక త్వరలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ‘డబుల్’ ఇళ్లు పొందేందుకు అర్హులైన 12వేల మంది అదృష్టవంతుల వివరాలు ఇవాళ వెల్లడించనున్నారు.

హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60వేల మందితో జాబితా సిద్ధం చేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ఈరోజు వెల్లడించనున్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పేర్లు, నంబర్లు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా(ర్యాండమైజేషన్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా పేర్లు, వివరాలు వెల్లడికానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news