కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వాసులు.. హెల్ప్ లైన్ నంబర్స్ రిలీజ్

-

ఒడిస్సా లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఏపీలోని విజయవాడకు చెందిన 120 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు కోల్కత్తా నుంచి విజయవాడకు వస్తున్నట్లు సమాచారం. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్లను…086667055,2576924 రైల్వే శాఖ ప్రకటించింది.

కాగా, ఒడిస్సా రైలు ప్రమాదం పై ప్రధాని మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోడీ. అలాగే రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్రేసియా కూడా ప్రకటించారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రకటించారు. అలాగే రైల్వే శాఖ నుంచి… మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు, తక్కువ గాయాలు అయిన వారికి 50 వేల రూపాయలను ప్రకటించింది రైల్వే శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news