విశాఖను క్రైమ్ క్యాపిటల్ గా మార్చారు : గంటా శ్రీనివాసరావు

-

విశాఖను క్రైమ్ క్యాపిటల్ గా మార్చారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలో ఎమ్మార్వో రమణయ్య హత్యపై మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు స్పందించారు. KGHలో ఆయన మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు గంటా. విశాఖ క్రైమ్ క్యాపిటల్ గా మారిందని తెలిపారు. 

గతంలో ఎంపీ కుటుంబాన్ని 48 గంటల పాటు కిడ్నాప్ చేశారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇవాళ ఈ హ్య జరిగేదా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన నగరంలో ఇలాంటి సంఘటనలు ఏంటీ అని ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు. ఒక రెవెన్యూ అధికారికే ఈ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకపోవడం చాలా బాధకరం అన్నారు. నిందితులనే వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. క్రైమ్ కావడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news