వంగవీటి రంగా లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాం – కొడాలి నాని

-

వంగవీటి రంగా భౌతికంగా దూరమై 35 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. నేడు గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి కొడాలి నాని పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం కష్టపడిన మహోన్నత వ్యక్తి రంగా అని.. నేటి రాజకీయాలలో ఆయన పేరు మీద ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఉందన్నారు.

ఆయన లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు కొడాలి నాని. కులం కోసం కాకుండా పేద ప్రజల కోసం కష్టపడిన మహోన్నత వ్యక్తి రంగా అని.. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. రాధా బాబుకు రాజకీయాలలో మంచి భవిష్యత్తును ఆ దేవుడు కల్పించాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version