చిత్తూరులో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్ !

-

ఈ రోజు చిత్తూరు జిల్లా చిత్తూరులో రెండు విషయాల పైన సీఎం జగన్ హాజరవడం జరిగింది. సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం మరియు అమూల్ డైరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడానికి విచ్చేశాడు. ఈ సందర్భంగా మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయకుడు అనే మనిషి తన స్వలాభం కోసం ఎన్నో నీతిలేని పనులను చేశాడని సీఎం జగన్ విమర్శించాడు. సొంత నియోజకవర్గం ప్రజల్నే దారుణంగా మోసం చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా అంటూ మండిపడ్డారు. కేవలం తనకు వచ్చే ముడుపుల కోసం ఆశపడి ప్రభుత్వ సంస్థలను అమ్మేసిన ఘనత చంద్రబాబుది అంటూ రెచ్చిపోయి మాట్లాడారు జగన్.

ఇప్పుడు నేను వచ్చిన మీ చిత్తూరుకు చంద్రబాబు గతంలో ఏమయినా చేశాడా అని చూసుకుంటే ఒక్కటీ గుర్తుకు రాదు అంటూ పాలనలో ఏమీ చేయలేదని చెప్పాడు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version