ఏపీ ఉద్యోగులకు శుభవార్త..వారానికి 5 రోజులే పనిదినాలు !

-

ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని దినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొరుగి పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అందులో పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతినెల మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం నిర్వహించాలని సిఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు… ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను ‘జగనన్నకు చెబుదాం’ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news