శుభకృత్ సంవత్సరంలో..ఏపీలో ఆర్థిక సంక్షోభం ఖాయం : యనమల

-

శుభకృత్ సంవత్సరంలో..ఏపీలో ఆర్థిక సంక్షోభం ఖాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించేందుకు ఐదు సంవత్సరాలు కావాలని ప్రభుత్వం అఫిడవిట్ వేయడం దుర్మార్గమని.. అమరావతిలో మౌళిక సదుపాయాలకు సంబంధించి 90 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాయని చెప్పారు.

మిగిలినవి పూర్తి చేసి రైతులకు అప్పగించేందుకు 6 నెలలు సరిపోతుందని.. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజా పంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని.. కరోనాతో ఆర్ధికంగా కుదేలైన ప్రజానీకాన్ని జగన్ ఆస్తిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీల బాదుడుతో దివాలా తీయించారని మండిపడ్డారు.

జే-బ్రాండ్లతో జనం జేబులకు చిల్లు పెట్టారని.. లూఠీ కోసం చేసిన అప్పులతో రాష్ట్రం అస్తవ్యస్తమైందని… వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పంచాయతీల నిధులు దారి మళ్లిస్తోందని చెప్పారు. పంచాయతీ నిధులు పీడీ ఖాతాలకు మళ్లించి ప్రభుత్వ ఆదీనంలో పెట్టుకుందని.. అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలను ఉంచడమే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమా? అని నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులను అధికార పార్టీ పెద్దలపై ఆధారపడేలా చేయడం, సర్పంచులపై సొంత పార్టీ వారిని వాలంటీర్లుగా నియమించి పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news