బాడీలు కాదు బ్రెయిన్స్ పెంచండి… జగన్ మాట ఇప్పుడు అర్ధం అయ్యిందంట!

-

ఒక పక్కేమో కరోనాను ఎలా కట్టడి చేయాలని జగన్ తపన, మరో పక్క సంక్షేమ పథకాలు అమలు గురించిన ఆలోచన, మరోపక్క ఆర్ధిక ఇబ్బందులు… ఈ పరిస్థితుల్లో ఏపీ సర్కార్ సమర్ధవంతంగా ముందుకు సాగుతుంటే… ఇది చూసి ఓర్వలేకో ఏమో కానీ… ఖాలీగా ఉన్న టీడీపీ నేతలు, మరి ముఖ్యంగా సీనియర్లు అనబడేవారు ప్రభుత్వంపై రోజుకో రకం విమర్శ చేస్తున్నారు. పైగా… ప్రపంచం మొత్తం చెప్పిన విషయాన్నే, శాస్త్రవేత్తలు వివరించిన విషయాన్నే జగన్ చెబుతున్న సరే… జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. మరి వీరిది అజ్ఞానం అనాలా, శాడిజం అనాలా, మూర్ఖత్వం అనాలా అని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్న దశ ఇది!

వివరాళ్లోకి వెళ్తే… కరోనా వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి హడావిడి, హైరానా ఇంతా అంతా కాదు. ముందు ఏమో… ప్రభుత్వం కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదు అన్నారు! తదనంతర పరిణామాల అనంతరం సీరియస్ గా తీసుకుంటే… కేసులు దాచేస్తున్నారు అన్నారు. కేసులు ఎక్కువ వస్తుంటే… చావులు దాచేస్తున్నారు అంటున్నారు! ఈ ప్రశ్నలు అన్నీ చూస్తుంటే… అసలు ఈయన బాధ ఏమిటో అర్ధం కావడం లేదని కొందరంటుంటే… ఇంకేముంది ఆంధ్రలో జనం కరోనాతో అల్లల్లాడిపోతే ఆ వంకన జగన్ పై నోరు పారేసుకుని ఆనందించొచ్చని అని మరికొందరు అంటున్నారు! వీరి ప్రవర్తన చూస్తుంటే… రెండోదే నిజం అనిపిస్తుందనుకోండి!!

ప్రపంచం మొత్తం వైద్యులు, శాస్త్రవేత్తలు… ఇది ఇప్పట్లో తగ్గే వ్యవహారం కాదు, కరోనా మళ్లీ శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ అటాక్ చేసే అవకాశం ఉంది… పోలియో మాదిరిగానే కరోనాతో కూడా మనిషి కొంతకాలం సహజీవనం చేయాలి అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ జనాలకు అర్ధమయ్యేలా చెబితే… దీనిపై కూడా వెటకారం ఆడుతున్న యనమల … కరోనా ఏమైనా మీ చుట్టమా జగన్…వస్తూ పోతూ ఉండటానికి అంటున్నారు! ఇలా ఉన్నాయి యనమల తెలివితేటలు! అసెంబ్లీ సాక్షిగా.. శరీరాలు పెంచడం కాదు బుర్రలు పెంచండి అని జగన్ అంటుంటే… టీడీపీ నేతల్ని జగన్ ఎందుకు అంత మాట అన్నారబ్బా అనుకున్నవారంతా… దాని అర్ధం తమకిప్పుడు అర్ధం అయ్యిందని అంటున్నారట! ఇకనైనా టీడీపీ నేతలు జగన్ మాట ఫాలో అవుతారని తమ్ముళ్లు ఆశిస్తున్నారంట!

Read more RELATED
Recommended to you

Latest news