BREAKING : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావ్?

-

గన్నవరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. 2019లో టిడిపి తరపున వల్లభనేని వంశీ, వైసీపీ తరపున యార్లగడ్డ పోటీ చేశారు. ఎమ్మెల్యే వంశీ, వైసీపీకి మద్దతు తెలిపినప్పటి నుంచి ఆ ఇద్దరు నేతల మధ్య గొడవ జరుగుతూనే ఉంది.

దీంతో యార్లగడ్డ పార్టీ మారనున్నారని, ఆదివారం దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. గన్నవరంలో కార్యకర్తలతో రేపు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక సమావేశం నిర్వహించానున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత కీలక నిర్ణయం యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నా అది రాకపోతే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తారని చెబుతోంది క్యాడర్. యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉండాలా, పార్టీ మారాలా అనే అంశంపై కార్యకర్తల భేటీలో యార్లగడ్డ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news