రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు

-

గత మూడు వారాల నుండి దేశ వ్యాప్తంగా టమాటాలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఒక కేజీ టమోటా ఏకంగా రూ. 150 పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడికి గుదిబండగా తయారయింది. దీనితో టమోటాలు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ రైతు ప్రాణం తీసాయి టమాటా ధరలు. మదనపల్లి – బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి టమాటా పంట పండించి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు.

టమాటా రేటు భారీగా పెరగడంతో గత 20 రోజుల్లోనే 30 లక్షల రూపాయల రాబడి వచ్చింది. డబ్బు కోసం ఆయనని హత్య చేయాలని కొందరు వ్యక్తుల కన్ను ఆయన మీద పడింది. బైక్ పై వస్తుండగా అడ్డగించిన దుండగులు, నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశారు. వ్యాపార వేత్తల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 30 లక్షలు రావాల్సిన అమౌంట్ బిల్లులు మృతదేహం వద్ద లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news