11 మంది ఎమ్మెల్యేలను మార్చిన వైసీపీ ?

-

11 మంది ఎమ్మెల్యేలను మార్చి టీజర్ వదిలారు… చాలా చోట్ల రియాక్షన్ వైలెంట్ గా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. నేరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది ఆయన పాలెగాళ్లదైతే శిక్ష ఎమ్మెల్యేలకా? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. నిన్నటి వరకు రాష్ట్ర ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారని వైకాపా నేతలు చెప్పారని, జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారని… ఆయన మళ్ళీ కావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారని ప్రశ్నించారు.

విశాఖపట్నం గత పాలెగాడు విజయ సాయి రెడ్డి గారు, ప్రస్తుత పాలె గాడైనా బాబాయి సుబ్బారెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి ఎవరిని అడిగినా చెబుతారని, వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేశారని, దసపల్ల హిట్స్, జోడుగూళ్ల పాలెం, ఆనందపురం జంక్షన్, రోడ్డు అలైన్మెంట్, విస్తరణలో వాళ్లు చేసిన భూకబ్జాల గురించి ఏ ఆటో డ్రైవర్ ను కదిపిన కథలు, కథలుగా చెబుతారన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో ఒక్క స్థానం కూడా గెలవకుండా విధ్వంసం సృష్టించింది అక్కడి పాలెగాళ్లయితే, దానికి ఎమ్మెల్యేలను మారుస్తామనడంలో అర్థం ఉందా అని రఘురామకృష్ణ రాజు గారు నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news