నీకు సిగ్గుందా..? – మంత్రి లోకేష్ పై వైసీపీ ఘాటు విమర్శలు

-

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జగన్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్ధంపదం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నారా లోకేష్. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే జగన్ ఎప్పుడో లండన్ ఎగిరిపోయేవాడని ఆరోపించారు.

74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సహాయం చేస్తున్న సీఎం చంద్రబాబు గారిపై విమర్శలు చేయడానికి మీకు వనసెలా వచ్చింది జగన్ అంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు. అయితే మంత్రి లోకేష్ చేసిన విమర్శలపై వైసీపీ ఘాటు విమర్శలు చేసింది.

“లోకేష్.. నీకు సిగ్గుందా..? నిన్న హైదరాబాద్ వెళ్లి ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో వచ్చావు. నీకు ప్రజల గురించి పట్టింపు ఉందా..? హుందాతనం గురించి నువ్వు మాట్లాడితే ఆ పదమే సిగ్గుపడుతుంది. బజారు భాషను ప్రవేశపెట్టి రెడ్ బుక్ అంటూ ఒక ఎర్రి బుక్కు పట్టుకొని పిచ్చి పాలన చేస్తున్న నువ్వు జగన్ ని నిందించడం విడ్డూరంగా ఉంది” అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది వైసిపి. వరదలపై రెవెన్యూ సెక్రటరీ, ఇరిగేషన్ ఇంజనీర్, కలెక్టర్ మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version