వైసీపీ ఇండియా, ఎన్డీఏలో లేదు.. మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు

-

ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం  విధితమే. ఈ నేపథ్యంలో ఇకపై దేశాన్ని ఇండియా గా కాకుండా భారత్ గా సంభోదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని డిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చే వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందు ఆహ్వాన పత్రికలో ”ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని రాసివుండటం వివాదానికి దారితీసింది. 

ఇండియా పేరును భారత్ గా మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలపై ఏపీ మంత్రి కొట్టుసత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి భారత్ అని పేరు మార్చినంత మాత్రాన విదేశాల వాళ్లు ఇండియా అని పిలకుండా ఉంటారా..? అని అన్నారు. అయితే వైసిపి అటు ఇండియా కూటమిలో గానీ, ఇటు ఎన్డీఏ కూటమిలో గానీ లేదని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేసారు. 

 ఏపీలోని ప్రముఖ దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయాలను రూ.400 కోట్ల అంచనాల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. రూపొందించిన ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. ప్రసాదం పోటు, అన్నదాన బిల్డింగ్, శివాలయం, రాక్ మిటిగేషన్, స్కాడా వంటి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version