పేదల బియ్యాన్ని పాలిష్ చేసి వైసిపి నేతలు విదేశాలకు అమ్ముతున్నారు – సత్య కుమార్

-

తెలంగాణలో క్రమ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్న బిజెపి.. అదే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుసరిస్తూ లక్ష్యం చేరుకోవాలని చూస్తోంది. జనసేన తో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. ఈ నేపథ్యంలోనే బిజెపి అగ్ర నేతలు తరచూ ఆ రాష్ట్ర పర్యటనలకు వస్తూ కాషాయ కార్యకర్తలలో జోష్ పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక రాష్ట్ర నాయకులు సైతం అధికార పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బిజెపి నేత సత్యకుమార్ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత కంపెనీలలో కల్తీ మద్యం తయారుచేసి సీఎం జగన్ పేదల రక్తాన్ని తాగుతున్నారని ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పేదల బియ్యాన్ని పాలిష్ చేసి వైసిపి నేతలు విదేశాలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మైనింగ్, ఇసుక, వైన్ పేరుతో దోచుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news