YCP: రోజా ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న వైసీపీ నేతలు !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో వైసిపి నేత ఆర్కే రోజా దారుణ ఓటమి ఎదుర్కొన్నారు. ఎన్నికలు జరగకముందే రాష్ట్రంలో మొదట ఓడిపోయేది రోజా అనే వార్తలు వచ్చాయి. అందరు ఊహించినట్టుగానే ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో రోజా రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది.

YCP leaders celebrated Roja’s defeat

ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు టాక్. మరోవైపు ఆమె తిరిగి జబర్దస్త్ లో రీఎంట్రీ ఇస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, వైసీపీ నేతలు రోజా ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నగరిలో రోజా చేసిన అరాచకాల వల్లే వైసీపీకి ఈ పరిస్థితి ఎదురైందని ఆ ప్రాంత మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ KJ శాంతి ఆరోపించారు.

బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతం తన అడ్డా అన్నట్టు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిన రోజాకు ఇక్కడితో పుల్‌స్టాప్ పడిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. నగరి వ్యాప్తంగా పలువురు నేతలు రోజా ఓటమితో ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news