చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటే బలయ్యేది రవి కిరణ్ రెడ్డినే !

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులతో ఆటలాడితే బలయ్యేది జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి గారేనని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఆటలు ఆడుకోవడం మానేయాలని సూచించారు. అన్ని తానే చెప్పి చేయిస్తున్నప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి గారు సునాయాసంగా తప్పించుకుంటారని, లండన్ లో సకుటుంబ సపరివార సమేతంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును చూసి ఆనందించిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయమే తనకు తెలియదని చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య సమస్యలను ధైర్యంగా వెల్లడించిన ప్రభుత్వ వైద్యులకు అభినందనలు తెలిపారు. గతంలో తనని అరెస్టు చేసి లాక్ అప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్, ప్రభుత్వ వైద్యులు ఇటువంటి ధైర్యాన్ని చేయలేకపోయారని, పొరుగు రాష్ట్రంలో జైల్లో గుండ్రాయిలా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి చిన్నానకు ఆరోగ్య కారణాల రీత్యా బెయిలు మంజూరు చేశారని, కానీ రెండు నెలలలోపే ఐదు కిలోల బరువు తగ్గి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తోందని అన్నారు. గుండె, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడైన చంద్రబాబు నాయుడు గారిని ఆసుపత్రికి పంపరా? అసలు మీరు మనుషులా… పశువుల అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news