షర్మిలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

-

 

మహిళల కన్నీటిని అడ్డం పెట్టుకొని తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అటువంటి మనమే మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం భావ్యమా అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి ఇంట్లో మగవారు లేరా?, ఆడవారే రోడ్డెక్కారని తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆర్థిక నేరాభియోగ కేసులలో జగన్మోహన్ రెడ్డి గారిని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అరెస్టు చేసినప్పుడు రోడ్డు ఎక్కింది ఎవరని ప్రశ్నించారు.

వై.యస్. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారితో పాటు వై.యస్. వెంకట్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన వారు ఎవరైనా రోడ్డెక్కారా? అని నిలదీశారు. వై.యస్. విజయమ్మ. గారు, వై.యస్. భారతి, వై.యస్. షర్మిల మరి కొంత మంది మహిళలతో కలిసి రోడ్డెక్కి తమ చీర కొంగులతో కన్నీళ్లు తుడుచుకుంటూ విపరీతంగా లేడీస్ సెంటిమెంట్ పండించారన్నారు.

జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య వదిలిన బాణాన్ని అని చెప్పుకొని చెల్లెలు కాళ్లకు వేసుకున్న బూట్లు అరిగేలా తిరిగారని, తల్లి, చెల్లి ఏమైనా పురుషులా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు గారు, ఇతరుల గురించి కామెంట్ చేసేటప్పుడు మన గురించి కూడా ఇతరులు ప్రశ్నిస్తారన్న ఇంకిత జ్ఞానం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదే విషయాన్ని తనకు ఒకరు ఫోన్ చేసి గతంలో జగన్ మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పాదయాత్ర చేసిన షర్మిల ప్రచారం నిర్వహించిన విజయమ్మ గారు ఏమైనా మగవారా అంటూ ప్రశ్నించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news