ఏపీ ప్రజలకు శుభవార్త..ఈ నెల 11 నుంచి ‘మా నమ్మకం నువ్వే జగన్’

-

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేద, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని… రకరకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారికి ఆర్థిక సహాయం చేసింది జగన్ సర్కార్. అయితే తాజాగా మరో స్కీం కు శ్రీకారం చుట్టనుంది జగన్ ప్రభుత్వం.

ఈనెల 11వ తేదీ నుంచి వైసీపీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందీ. ప్రభుత్వ పథకాలు అందుకున్న ఇండ్ల వివరాలు సేకరించి… ఆయా ఇండ్లకు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లను అందించనుంది.

ఇందుకోసం గృహ సారధులు మరియు వాలంటీర్ల సహాయం తీసుకోనుంది వైసిపి. ఆ ఇంటి యజమాని స్టిక్కర్లు వేయాలని అనుమతి ఇస్తేనే, అతికించాలని నిర్ణయం తీసుకుంది వైసిపి. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనాల్లోకి ఏ రీతిలో మరియు ఏ స్థాయిలో వెళుతున్నాయో తెలుసుకుందుకే, ఈ స్టిక్కర్ల కార్యక్రమాన్ని చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news