విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్, లోకేష్ మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని చురకలు అంటించారు. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని మండిపడ్డారు.

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుంది. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయ్యింది. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు.
వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్. పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు ? చదువులతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారని చురకలు అంటించారు.పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీ రీ వెరిఫికేషన్ ఉచితంగా చేయండి అని డిమాండ్ చేసారు.