చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై షర్మిల ఫైర్‌..ఆ బానిస బతుకు ఎందుకు ?

-

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై షర్మిల ఫైర్‌ అయ్యారు. ఆ బానిస బతుకు ఎందుకు ? అంటూ నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ,ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు. బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ys sharmila on chandrababu and pawan kalyan

2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారు.బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీ లకు ప్రజలు బుద్ధి చెప్పాలి. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.రాహుల్ గాంధీ గారు యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news