ఆరోగ్యశ్రీ పథకం తీసేస్తే మీ అంతుచూస్తాం- బాబుకు షర్మిల హెచ్చరిక !

-

ఆరోగ్యశ్రీ పథకం తీసేస్తే మీ అంతుచూస్తామని చంద్రబాబుకు షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయని…. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? అంటూ వాపోయారు షర్మిల. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అంటూ నిలదీశారు.

ys sharmila warns babu over arogya sree

అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? అంటూ ఫైర్ అయ్యారు. బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? అంటూ ఆగ్రహించారు. దీనికి చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకమని… పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకమని వివరించారు. ఈ పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news