BREAKING: వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు

-

BREAKING: వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు అయింది. వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హై కోర్టు. వివేకా నందారెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు.

YS Sunitha gets sued in AP High Court

వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారని కృష్టారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే… పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్. దీంతో వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హై కోర్టు. ఈ తరుణంలోనే.. వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news