తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో… మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

నిన్న నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కాగా, నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు, వచ్చి చేరుతోంది వరద. ప్రస్తుతం ప్రాజెక్టు లోకి 50వేళా క్యూస్సేక్కులు ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిల నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090.60 అడుగులు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news