ఏపీ నూత‌న సీఎస్‌గా పునేత‌

-

అమ‌రావ‌తి: ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా అనిల్‌ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్‌ దినేష్‌కుమార్‌ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్‌ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. పునేఠా 2019 మే 31వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. సీఎస్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు పునేఠా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news