తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

-

ఏపీని తండ్రీ కొడుకులు అడ్డంగా దోచుకుంటున్నారని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నగర భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్డూరి శ్రీరామ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుది అన్నం పెట్టే చేయినే నరికే పద్దతి అని.. ఏపీకి అన్ని విధాల సాయం చేస్తున్న కేంద్రాన్ని కూడా అలాగే మోసం చేశారని విమర్శించారు. పచ్చ కండువా కప్పుకున్న వారికే నిధులు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ.2,500కోట్లు ఇస్తే.. నాలుగు భవనాలు కూడా కట్టలేదన్నారు. రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. రాజధాని భూములతో చంద్రబాబు భూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news