ఎట్టకేలకు ఎఫ్ 3 పట్టాల మీదకి..

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2, ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా వందకోట్లకి పైగా షేర్ సాధించింది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఎఫ్ 3 ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించాడు. దాంతో అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కనుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ టైమ్ లో ఎఫ్ 3 స్క్రిప్టు కూడా పూర్తయిందని వినిపించింది.

ఐతే ఎట్టకేలకు ఎఫ్ 3 సినిమా పట్టాలెక్కింది. ఈ మేరకు అనిల్ రావిపుడి ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసాడు. ఎఫ్ 2 సినిమాలో భార్యా భర్తల మధ్య బంధాలతో వినోదం పుట్టించిన అనిల్ రావిపూడి, ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ తో నవ్వించడానికి వస్తున్నాడు. డబ్బు చుట్టూ కథ నడిపి ఎంటర్ టైన్ చేయాలని డిసైడ్ అవుతున్నాడు. ఈ మేరకు అనిల్ రావిపూడి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ఇష్యూ డబ్బులు అయినపుడు మరి ఫన్ పీక్స్‌లో ఉంటుందిగా.. అంతేగా అంతేగా..” అని పోస్ట్ పెట్టాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news