BREAKING : ఐసీయూలో అంజన్ కుమార్ యాదవ్ !

-

తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులు గా అస్వస్థతకు గురైన అంజన్ కుమార్ యాదవ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అయితే.. ఈ పరీక్ష ల్లో ఆయన కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ గా నిర్ధారణ కావడమే కాదు… ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ వార్డు ఉంచారని సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్‌ లోని అపో లో ఆస్పత్రి లో అంజన్ కుమార్ యాదవ్ కు కరోనా వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి కాస్త విషమించడం తో… ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news