బ్రేకింగ్ : తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ పై మరో ఫిర్యాదు

-

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంపై… ఫిర్యాదు చేయగా… తాజాగా మరో ఫిర్యాదు కూడా తెరపైకి వచ్చింది. సంతోష్ నగర్ యూనియన్ బ్యాంకు నుంచి ఏకంగా ఎనిమిది కోట్లు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తెలుగు అకాడమీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తాజా ఫిర్యాదుతో తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం ఏకంగా రూ. 51 కోట్లకు చేరుకుంది.

కార్వాన్ మరియు సంతోష్ నగర్ యూనియన్ బ్యాంకు నుంచి… తెలుగు అకాడమీ మీ నిధులు మాయమయ్యాయి. బ్యాంకు మేనేజర్ తోపాటు తెలుగు అకాడమీ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోగా… తాజాగా మరో ఫిర్యాదు అందడం అందరిని… ఆందోళనకు గురి చేస్తోంది. ఇక తాజా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news