‘జై హనుమాన్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్

-

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

ఇదిలా ఉంటే… హనుమాన్ జయంతి రోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక అప్డేట్ ఇచ్చారు. తాను తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మనమంతా విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంటూ మూవీ పోస్టర్ను పంచుకున్నారు ఈ మూవీ డైరెక్టర్.అంతకుముందు శ్రీరామనవమి రోజున విడుదల చేసిన పోస్టర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news