T20 ప్రపంచకప్ గురించి సోషల్ మీడియాలో చర్చ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే t 20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే… T20 వరల్డ్ కప్ విషయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో విఫలమవుతున్న వారిని పక్కన పెట్టి, రాణిస్తున్నవారిని తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, గిల్, జైస్వాల్, రాహుల్, రింకూ సింగ్ ఎంపిక కాబట్టే అవకాశం ఉంది.వీరితో పాటు పరాగ్, తిలక్, అభిషేక్, శశాంక్, దూబే, డీకే, చాహల్, నటరాజన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఐపీఎల్ లో పంత్, జడ్డూ, పాండ్య, అర్షదీప్, సిరాజ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news