రంగారెడ్డి జిల్లా చేవెళ్ల‌లో మ‌రో దిశ ఘ‌ట‌న‌.. అత్యాచారం, దారుణ హ‌త్య‌..!

-

హైద‌రాబాద్‌లో జరిగిన దిశ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే రంగారెడ్డి జిల్లాలో అలాంటిదే మ‌రొక సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండ‌లం తంగ‌డ‌ప‌ల్లిలో దిశ త‌ర‌హాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మంగ‌ళ‌వారం ఉద‌యం తంగ‌డ‌ప‌ల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియ‌ని మ‌హిళ (30) మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు.

another disha incident in rangareddy district chevella

స‌ద‌రు మ‌హిళ శ‌రీరంపై దుస్తులు లేక‌పోవ‌డంతో ఆమెపై ఎవ‌రో అత్యాచారం చేసి ఆపై ఆమెను హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. త‌ల‌పై బండ‌రాయితో మోదిన ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయ‌ని, ఆమెపై అత్యాచారం చేశాక రాయితో త‌ల‌పై మోది ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఘ‌ట‌న జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఇక ఆ మ‌హిళ‌కు చెందిన ఎలాంటి వ‌స్తువులు, దుస్తులు సంఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసుల‌కు ల‌భించ‌లేదు. దీంతో ఆమె ఎవ‌రు..? అనే విష‌యం గుర్తించ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది.

కాగా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేవెళ్ల డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి చేరుకుని ఘ‌ట‌న జ‌రిగిన తీరును ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేశారు. హ‌త్య‌కు గురైన యువ‌తి ఎవ‌రు అనేది తెలిస్తే నిందితుల‌ను ప‌ట్టుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news