బాలీవుడ్ కి వెళ్తున్న మరో తెలుగు చిత్రం.. అజయ్ దేవగణ్ నిర్మాతగా..

-

బాలీవుడ్ నిర్మాతలకి తెలుగు సినిమాలపై ఆసక్తి బాగా పెరిగింది. ఇక్కడ సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాలన్నింటినీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు హిందీలో తెరకెక్కాయి. తాజాగా మరో తెలుగు చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులని అలరించనుంది. గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్ళు సాధించిన బ్రోచేవారెవరురా చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ మేరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, బ్రోచేవారెవరురా హిందీ హక్కులని రికార్డు ధరకి కొనుక్కున్నాడు.

అభయ్ డియోల్, కరణ్ డియోల్.. హీరోలుగా కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. స్క్రిప్ట్ పూర్తయిన మరుక్షణం షూటింగ్ కి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. అజయ్ దేవగణ్ నిర్మాతగా ఈ రీమేక్ తెరకెక్కనుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కి తెలుగు ప్రేక్షకులని అలరించిన బ్రోచేవారెవరురా చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మరి హిందీలో రూపొందబోతున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది ఇంకా తేలలేదు.

Read more RELATED
Recommended to you

Latest news