ఏపీ బడ్జెట్​లో సంక్షేమానికి పెద్దపీట.. ఏ పథకానికి ఎంత కేటాయించారంటే..?

-

సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ.31,061కోట్లుగా ఉందని తెలిపారు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.

బడ్జెట్​లో సంక్షేమ పథకాల కేటాయింపులు ఇలా ..

► వైఎస్సార్ పెన్షన్‌ కానుక రూ.21,434.72 కోట్లు

► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు

► వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

► జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

► జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

► వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

► డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు

► రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు

► వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

► జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు

► వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు

► వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

► వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు

► మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు

► రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

► లా నేస్తం రూ.17 కోట్లు

► జగనన్న తోడు రూ.35 కోట్లు

► ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

► వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

► వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు

► వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు

► అమ్మఒడి రూ.6,500 కోట్లు

► జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news