ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 332 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 332 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,60, 804 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 06 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 313 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5709 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 40 , 782 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 30, 219 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 90, 16 , 065 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news