ఏపీ లో కొత్తగా 159 కరోనా కేసులు, ఒక మరణం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ మరోసారి తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ అమాంతం పడిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ లో కొత్తగా 159 కరోనా మహమ్మారి కేసులు నమోదయ్యాయి. అలాగే కృష్ణాజిల్లాలో ఒక మరణం సంభవించింది.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73, 252 కి పెరిగింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 444 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2138 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 169 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 56 , 670 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 29 , 263 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 04, 75, 940 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికీ ఒమిక్రాన్ వైరస్ సోకింది.

 

Read more RELATED
Recommended to you

Latest news