ఏపీలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,13,212 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 698 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14726 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ap carona

ఇక గడిచిన 24 గంటల్లో 4636 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,83, 788 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 15, 193 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3 , 28 , 46, 978 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతం లో కంటే ఇప్పుడు కరోనా కేసులు భారీగా తగ్గడం శుభ సూచకం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version