ఏపీలో కొత్తగా 2,690 కరోనా కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కారణంగా ఏపీలోనూ కేసులు తగ్గుతున్నాయి. ఇవ్వాళ కూడా ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 2,690 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2303455 కి పెరిగింది.


కోవిడ్ వల్ల ప్రకాశంలో ఇద్దరు, అనం తపురం , చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం మరియు విజయనగరం లలో ఒక్కొ క్క రు చొప్పు న మరణిం చారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 664 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69572 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,855 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2219219 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 28,598 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,26,60,687 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news