ఏపీ కరోనా అప్డేట్.. ఇవాళ 865 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. ఏపీ లో కరోనా కేసులు ఇవాళ కూడా మళ్లీ తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 865 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,51, 998 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 09 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 195 కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 50, 304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 84, 00, 471 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 574 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1424 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,27, 229 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news