అమ్మ వారి పేరు పెట్టిన వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు : డిప్యూటీ సీఎం కొట్టు

-

ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి నియోజకవర్గంలో అమ్మఒడి కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ ప్రసంగిస్తూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, పవన్ కల్యాణ్ ఎందుకు అంటిపెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాదని అన్నారు ఆయన. పవన్ కల్యాణ్ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ వాహనాన్ని ఏపీ సీఎం జగన్ లారీ అని హేళన చేశారు. దీంతో ఆయనకు తెలుగు రాదంటూ పవన్ కూడా కౌంటర్ ఇచ్చారు.

దీనిపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా స్పందించారు. వారాహి అన్నది అమ్మవారి పేరని చెప్పారు. లారీని లారీ అనక ఇంకేమంటారని కూడా అన్నారు ఆయన. అమ్మ వారి పేరు పెట్టిన వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కొట్టు. పవన్ చెప్పే అసత్యాలు విని ఆ వారాహి అమ్మవారు ఆయనను శిక్షిస్తుందని అన్నారు ఆయన. చంద్రబాబు అధికారంలో ఉంటేనే పవన్ కు ప్యాకేజీ వస్తుందని కొట్టు సత్యనారాయణ్ హేళన చేశారు. అందుకే చంద్రబాబుకి పవన్ మద్దతు పలుకుతున్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా అమ్మఒడి అందించామని వెల్లడించారు కొట్టు సత్యనారాయణ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version