ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్.. కేసులు నమోదు

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తన భార్య, కొడుకుతో కలిసి కుంభమేళాకు వెళ్లి పవిత్రస్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు దుండగులు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసింది.

దీంతో ఏపీలోని పలుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లకు ఫిర్యాదులు అందాయి. పవన్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు నమోదైంది.చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పెడుతున్న వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news