ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

-

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు పెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన అన్నారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతులు.. తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని అన్నారు.

పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్న ఆయన ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నమాని అన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, సానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news