BREAKING : వైసీపీలో విషాదం.. గుండెపోటుతో మంత్రి మేకపాటి మృతి..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి గుండెపోటు వచ్చింది.  దీంతో ఆయన మృతి చెందారు.  గుండె పోటు రావడంతో నిన్న రాత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు.

కానీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో… కాసేపటి క్రితమే మృతి చెందారు.   ఆయన పల్స్ దొరకడం కూడా కష్టంగా ఉందని అపోలో వైద్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఐటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రి గౌతమ్ రెడ్డి.. దుబాయ్‌ వెళ్లారు. అయితే.. దుబాయ్‌ పర్యటన చూసుకుని నిన్ననే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డికు.. ఇవాళ ఉదయమే గుండెపోటు వచ్చింది.ఇక మేకపాటి మృతి పట్ల…  వైసీపీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news