AEE అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి : హరీష్ రావు

-

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం అని హరీష్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version